అక్రమంగా తరలిస్తున్న 7 కిలోల బంగారం సీజ్..

అక్రమంగా తరలిస్తున్న 7 కిలోల బంగారం సీజ్..

ఆంధ్రప్రదేశ్ లో భారీగా బంగారం పట్టుబడింది. ఫిబ్రవరి 2వ తేదీ శుక్రవారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు.. అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని సీజ్ చేశారు. నెల్లూరు జిల్లా గూడూరు నుంచి రైలు మార్గంలో కొంతమంది బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో.. పోలీసులు రైల్వే స్టేషల్ లో తనిఖీలు నిర్వహించి 10మందిని అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి  6.92 కిలోల బంగారంతోపాటు రూ.49,970 నగదును స్వాధీనం చేసుకున్నారు. 

పట్టుబడిన బంగారం విలువ మార్కెట్ లో దాదాపు రూ.4కోట్లు ఉంటుందని జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌ తెలిపారు. మొత్తం 10 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు వెల్లడించారు.