
న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) కొత్త ప్రెసిడెంట్గా సంజయ్ సింగ్ ఎన్నికయ్యాడు. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో సంజయ్ 40–-7 ఓట్ల తేడాతో 2010 కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ అనితా షియోరాన్పై విజయం సాధించాడు. మొత్తం 15 పోస్ట్ల్లో సంజయ్ ప్యానెల్ 13 గెలుచుకుంది. యూపీ రెజ్లింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా పని చేస్తున్న సంజయ్.. డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు అత్యంత సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి కావడంతో రెజ్లర్లలో మళ్లీ ఆందోళన మొదలైంది.
అనితా షియోరాన్ ప్యానెల్కు చెందిన ప్రేమ్ చంద్ లోచాబ్, దేవేంద్ర సింగ్ కడియాన్ కీలకమైన సెక్రటరీ జనరల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్లను గెలుచుకున్నారు. ప్రేమ్ చంద్ 27–19 ఓట్ల తేడాతో దర్శన్ లాల్పై, దేవేంద్ర సింగ్ 32–15తో ఐడీ నానావతిపై నెగ్గారు. జై ప్రకాశ్ (ఢిల్లీ), అసిత్ కుమార్ సాహా (వెస్ట్ బెంగాల్), కర్తార్ సింగ్ (పంజాబ్), ఎన్ ఫోనీ (మణిపూర్) వైస్ ప్రెసిడెంట్స్గా విజయం సాధించారు. ఉత్తరాఖండ్కు చెందిన సత్యపాల్ సింగ్ దేశ్వాల్ కొత్త ట్రెజరర్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఐదుగురు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా సంజయ్ సింగ్ అభ్యర్థులే గెలిచారు.