న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యలు, ఉద్యోగం కోల్పోవడం, హాస్పిటల్వంటి పెద్ద ఖర్చులు రావడం వంటి సమస్యల కారణంగా చాలా మంది అప్పులు కట్టలేకపోతుంటారు. ముఖ్యంగా పర్సనల్లోన్లు, క్రెడిట్కార్డుల బిల్స్, కిస్తీల ఎగవేతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆర్బీఐ, క్రెడిట్ఇన్ఫర్మేషన్ లిమిటెడ్(సిబిల్) లెక్కలను చూస్తే.. ఇలాంటి ఎగవేతలు కరోనా ముందు నాటికంటే కంటే ఎక్కువగా ఉన్నాయి. కిస్తీలు కట్టకపోవడంతో డిఫాల్టర్లు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. లోన్ రికవరీ ఏజెంట్లు విపరీతంగా ఇబ్బందిపెడుతుంటారు. తరచూ కాల్స్ చేసి విసిగిస్తుంటారు.
కిస్తీలు కట్టకపోవడంతో క్రెడిట్హెల్త్ బాగా దెబ్బతింటుంది. క్రెడిట్స్కోర్ తగ్గడం వల్ల అప్పులపై ఎక్కువ వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఉద్దేశపూర్వకంగా అప్పులను ఎగ్గొట్టే వారిని మినహాయిస్తే మిగతా వారి కేసులను సానుభూతితో చూడాలని, బకాయిలు కట్టేందుకు తగినంత గడువు ఇవ్వాలని రూల్స్ చెబుతున్నాయి. ఇలాంటి బాధితులకూ కొన్ని హక్కులు ఉంటాయి. ముందుకు వీళ్లకు నోటీసులు ఇవ్వాలి. అప్పుల వసూలుకు వేధించకూడదు. సమస్య పరిష్కరించుకునేందుకు లీగల్అసిస్టెన్స్తీసుకునేందుకు అవకాశం ఇవ్వాలి. క్రెడిట్రిపోర్టింగ్సక్రమంగా ఉండాలి.
ఆర్బీఐ గైడ్లైన్స్ ఏం చెబుతున్నాయ్ ?
డిఫాల్టర్లకు సాయం చేయడానికి ఆర్బీఐ కొన్ని గైడ్లైన్లను విడుదల చేసింది. అప్పు కట్టలేని వారిని లోన్ను రీస్ట్రక్చర్ చేయాలి. ఈఎంఐని తగ్గించాలి. రీపేమెంట్ పీరియడ్ను పెంచాలి. దీనివల్ల డిఫాల్టర్లు అప్పులు చెల్లించడానికి అవకాశాలు పెరుగుతాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి తన రూ.10 లక్షల లోన్ను కట్టలేకపోతున్నాడు. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ముందుగా రూ.ఐదు లక్షలు మెల్లమెల్లగా, ఒత్తిడి లేకుండా కట్టడానికి అనుమతించాలి. దీర్ఘకాలంలో మిగతా మొత్తాన్ని వసూలు చేయాలి. అప్పు చెల్లింపు ఆలస్యమైతే క్రెడిట్స్కోర్ తగ్గుతుంది. దీనివల్ల అప్పులు పుట్టడం కష్టమవుతుంది. పుట్టినా ఎక్కువ వడ్డీ భరించాలి. స్కోరు కనీసం 750 పాయింట్లు ఉండాలి. ఇంతకంటే తక్కువ ఉంటే ఎక్కువ వడ్డీ ఉంటుంది.
బ్యాంకులు ఎలా వ్యవహరించాలి ?
డిఫాల్టర్లపై ఘర్షణపూరిత వైఖరిని ప్రదర్శించకూడదు. బాధితుల పరిస్థితులకు తగిన పరిష్కారాన్ని అందించాలి. వాళ్లు భరించగలిగేలా కిస్తీల మొత్తాన్ని మార్చాలి. డిఫాల్టర్లు కూడా తమ సమస్యను వీలైనంత త్వరగా బ్యాంకుకు తెలియజేయాలి లోన్రీస్ట్రక్చర్ కోరాలి. క్రెడిట్స్కోర్ను రక్షించుకోవడానికి ప్రయత్నించాలి. సమస్య నుంచి బయటపడేందుకు నిపుణుల సాయం తీసుకోవాలి.
డిఫాల్టర్ల చట్టపరమైన హక్కులు ఏమిటి?
ఉద్దేశపూర్వక ఎగవేతదారులు లేదా మోసపూరితమని వర్గీకరించిన ఖాతాలకు రాజీ చేసుకోవాలని లేదా టెక్నికల్ రైట్-ఆఫ్లను చేపట్టాలని బ్యాంకులను, ఫైనాన్స్ కంపెనీలను ఆర్బీఐ ఇటీవల ఆదేశించింది. రాజీలకు, సెటిల్మెంట్లకు వచ్చిన బ్యారోవర్లు కనీసం 12 నెలల కూలింగ్ పీరియడ్ తరువాత కొత్త లోన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. బ్యాంకులను బట్టి కూలింగ్ పీరియడ్ మారుతూ ఉంటుంది. డిఫాల్టర్లకు 1. నోటీసును పొందే హక్కు, 2. న్యాయమైన అప్పు వసూలు పద్ధతుల హక్కు, 3. ఫిర్యాదు, పరిష్కార హక్కు, 4. న్యాయ సహాయం కోరే హక్కు, 5. ఫెయిర్ క్రెడిట్ రిపోర్టింగ్ పొందే హక్కులు ఉంటాయి.