తెలంగాణకు కేసీఆర్ చేసిందేంటి? : బీజేపీ నేత రవీంద్ర నాయక్

తెలంగాణకు  కేసీఆర్ చేసిందేంటి? : బీజేపీ నేత రవీంద్ర నాయక్

న్యూఢిల్లీ, వెలుగు: ‘‘ఛాయ్ వాలా అయిన ప్రధాని మోదీ.. దేశానికి ఏమి చేయడం లేదని కేటీఆర్ విమర్శిస్తున్నరు. మరి ఆయన తండ్రి దారూవాలా కేసీఆర్.. రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలి?” అని బీజేపీ నేత, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ప్రశ్నించారు. కేటీఆర్ ఓ రాజకీయ బచ్చా అని విమర్శించారు. ప్రధానిని ఛాయ్‌‌వాలా అంటూ కేటీఆర్ చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే.. గతంలో అమెరికాలో ఆయన బాత్రూమ్స్‌‌ కడిగారంటూ జరిగిన ప్రచారం నిజమే అనిపిస్తున్నదన్నారు.

శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో మీడియాతో ఆయన మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, ట్రిపుల్ తలాక్, రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేయడం వంటి ఎన్నో నిర్ణయాలను ప్రధాని తీసుకున్నారని చెప్పారు.