హైదరాబాద్,వెలుగు: వెటర్నరీ డాక్టర్కు హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో ఏం పని అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రశ్నించారు. హకీంపేట్ స్కూల్ వ్యవహారంపై ఆదివారం ట్వీట్ చేశారు. ‘‘ఈ దుండ గుడు ఎవరో హరికృష్ణ అని అంటున్నారు. ఆయన్ను పశుసంవర్థకశాఖ నుంచి క్రీడాశాఖకు ఎవరు బదిలీ చేశారు? ఎందుకు బదిలీ చేశారు? తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నాయకుడు అనేనా మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ఆయనకు 2025 దాకా డిప్యుటేషన్ ఇచ్చారు.
హరికృష్ణ, శ్రీనివాస్ గౌడ్ వ్యవహారాల మీద లోతైన విచారణ జరిపించాలి. ఆ కీచకుడిని అరెస్ట్ చేయాలి. మహిళలంటే కేసీఆర్కు గౌరవం ఉంటే.. బాధిత బిడ్డలకు న్యాయం జరిగేలా శ్రీనివాస్గౌడ్ను బర్తరఫ్ చేయాలి. మీ పిల్లలకొక న్యాయం.. మా పేద పిల్లలకొక న్యాయం ఉండొద్దు.’’ అంటూ ప్రవీణ్కుమార్ ట్వీట్ చేశారు. లేటుగానైనా గ్రూప్–2 అభ్యర్థుల బాధను అర్థం చేసుకున్నందుకు కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రవీణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.