‘టాక్సిక్’ థియేటర్లలోకి రావడానికి కేవలం 24 గంటల కంటే తక్కువ సమయమే ఉంది. అయినప్పటికీ, హైదరాబాద్తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) ఇంకా టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
ఈ భారీ బడ్జెట్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26న గ్రాండ్గా తెరపైకి రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు.. టికెట్ ధరల పెంపునకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వుల (GO) కోసం ఎదురుచూస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు ధృవీకరించాయి.
ఈ జీఓ రాగానే బుకింగ్స్ ఓపెన్ అవుతాయని స్పష్టమౌతోంది. ధరల పెంపుపై క్లారిటీ రాగానే బుకింగ్ గేట్లు తెరుచుకుంటాయని సినీ వర్గాల టాక్. అయితే, ఇలా ఆఖరి నిమిషం వరకు కూడా బుకింగ్స్ పెట్టకపోవడంతో ఫ్యాన్స్లో అసహనం వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే అడ్వాన్స్ బుకింగ్స్, మరియు సినిమా ఫస్ట్ టాక్ పైన ప్రభావం చూపే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
Coming to unleash what even Legends fear - In One day!💥💥💥#Toxic: A Fairy Tale for Grown-Ups In Cinemas Worldwide from TOMORROW! 🔥
— KVN Productions (@KvnProductions) August 25, 2026
Bookings Open. Grab your Tickets now! 🎟https://t.co/i6ZH4CSrji#ToxicOn26thAug@TheNameIsYash #Nayanthara @advani_kiara #TaraSutaria… pic.twitter.com/CGBxFEuuCt
భారీ క్రేజ్ ఉన్న ఇలాంటి పాన్-ఇండియా చిత్రానికి లాస్ట్-మినిట్ కన్ఫ్యూజన్ మేకర్స్కు ఆందోళన కలిగిస్తోంది. 'కేజీఎఫ్ 2' తర్వాత యష్ భారీ కంబ్యాక్ ఫిల్మ్ ఇది. బ్లాక్బస్టర్ 'కేజీఎఫ్: చాప్టర్ 2' విజయం సాధించిన దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత యష్ సిల్వర్ స్క్రీన్పైకి గ్రాండ్గా రీఎంట్రీ ఇస్తున్నారు.
డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ అండర్ వరల్డ్ బ్యాక్డ్రాప్లో డార్క్, స్టైలిష్ పీరియడ్ గ్యాంగ్స్టర్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించింది. ఈ చిత్రంలో యష్ సరసన నయనతార, కియారా అద్వానీ, హూమా ఖురేషి, తారా సుతారియా మరియు రుక్మిణీ వసంత్ తదితరులు పవర్-ప్యాక్డ్ స్టార్స్ అలరించనున్నారు.
