జ్యోతిష్యం: మనీ ప్లాంట్​ మొక్కకు మట్టి కుండీ.. గాజు సీసా ఏది బెస్ట్​..

 జ్యోతిష్యం: మనీ ప్లాంట్​ మొక్కకు  మట్టి కుండీ.. గాజు సీసా  ఏది బెస్ట్​..

జ్యోతిష్య, వాస్తుశాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్​ మొక్క... ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి స్థిరంగాఉంటుందని.. ఐశ్వర్యం అభివృద్ది కలుగుతుందని నమ్ముతుంటారు.  అయితే ఈ మొక్కను కొంతమంది మట్టి కుండీలోనూ.. మరి కొంతమంది గాజు వస్తువుల్లో పెట్టుకుంటారు.  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మొక్కను ఎందులో నాటాలి.. అది ఇంట్లో ఏదిశలో పెంచుకోవాలో తెలుసుకుందాం.  . .

గాజు సీసాలో మనీ ప్లాంట్ నాటడం

జ్యోతిష్య, వాస్తు నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం  గాజు సీసాలో మనీ ప్లాంట్  మొక్కను నాటడం చాలా మంచిదని చెబుతున్నారు పండితులు.  ఇలా చేయడం వలన ఇంట్లోకి పాజిటివ్​ పవర్​ వస్తుందని చెబుతున్నారు.  మనీ ప్లాంట్​ మొక్క ఇంట్లో ఉంటే ఐశ్వర్యం కలిగి... ఆర్థిక ఇబ్బందులు కలగవని చెబుతున్నారు. ఇంకా ఇంట్లో ఉన్న  ప్రతికూల శక్తి తొలగిపోయి.. ఆనందం.. శాంతి నెలకొంటుంది

మనీ ప్లాంట్‌ను ఈశాన్యం లేదాఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల సంపద పెరుగుతుంది. ఈ మొక్కను మట్టిలో కంటే నీటిలో పెంచడం చాలా సులభంగా ఉంటుంది.  నీటిలో ఈ మొక్క చాలా తొందరగా పెరుగుతుంది. అందుకే చాలా మంది గాజు వస్తువుల్లో నీరు పోసి మనీ ప్లాంట్​ మొక్కను పెంచుకుంటారు. మనీ ప్లాంట్​ గాజులో సీసాలో ఎంతో అందంగా ఉంటుంది.