భారత్​ మార్కెట్లోకి ఫేక్ మెడిసన్.. వాడితే ఖతమే అంటున్న డబ్ల్యూహెచ్ఓ

భారత్​ మార్కెట్లోకి ఫేక్ మెడిసన్.. వాడితే ఖతమే అంటున్న డబ్ల్యూహెచ్ఓ

రోగుల చికిత్సలో ఉపయోగించే డీఫిబ్రోటైడ్​ సోడియం(DEFITELIO (defibrotide sodium)) అనే మెడిసన్​ని ఫేక్​ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరించింది. 

దీనిని వాడితే సైడ్​ఎఫెక్ట్స్​ వస్తాయని తద్వారా రోగి ప్రాణాలే పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. భారత్, టర్కీలలో ఇవి విచ్చలవిడిగా విక్రయిస్తున్నట్లు తెలిపింది.  

ఈ మందుని  హేమాటోపోయిటిక్ (రక్తం) స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకుంటున్న పెద్దలు, పీడియాట్రిక్ రోగులలో వెనో-ఆక్లూసివ్ డిసీజ్ చికిత్సకు యాంటిథ్రాంబోటిక్​ ఏజెంట్​గా ఉపయోగిస్తారు. 

Also Read : నటి, రాజకీయ వేత్త రమ్య చనిపోయారంటూ పుకార్లు

వీటిపై తప్పుడు వివరాలు ముద్రించి అమ్ముతున్నారు. ఔషధ సరఫరాలో అగ్రగామిగా ఉన్న భారత్​లోనూ ఫేక్​ మెడిసన్​విక్రయాలు జరగడంపట్ల డబ్ల్యూహెచ్​ఓ ఆందోళన వ్యక్తం చేసింది. 

నిజమైన మెడిసన్ లాట్20G20Aతో ఉండి జర్మన్/ఆస్ట్రియన్ లో ప్యాకింగ్​ చేసి ఉంటుందని తెలిపింది. ఫేక్ పై ఇలాంటి వివరాలకు బదులుగా వేరేవి ఉంటాయని తెలిపింది. ఈ మెడిసిన్​ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించడం ఇదే తొలిసారి కాదు. 2020లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, లాట్వియా, మలేషియా, సౌదీ అరేబియా వంటి దేశాల్లో నకిలీ డ్రగ్ విక్రయిస్తున్నట్లు అప్పుడే వెల్లడించింది. 

అవయవాల మీద తీవ్ర ప్రభావం..

ఈ ఫేక్ మెడిసన్​ వివరాలు చూసుకోకుండా పేషెంట్స్ కి వాడితే ప్రాణాపాయం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  కొన్ని రకాల సైడ్​ఎఫెక్స్ట్ దీర్ఘకాలంలో రోగి శరీరం వెంటే ఉంటాయని అవి వేర్వేరు అవయవాల మీద దుష్ప్రభావాన్ని చూపుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఇలాంటి మెడిసన్స్ తయారు చేస్తున్న వారిని కఠినంగా శిక్షిం చి వీటిని అరికట్టాలని వైద్యలు సూచిస్తున్నారు.