భూ కబ్జాలకు ఎవరు పాల్పడినా సహించేది లేదు

భూ కబ్జాలకు ఎవరు పాల్పడినా సహించేది లేదు
  • బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయండి 
  • ఎమ్మెల్సీ రవిందర్ రావు

మహబూబాబాద్ జిల్లా:  ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే.. మా ఆధికార పార్టీ నాయకులైనా భూ కబ్జాలకు పాల్పడితే సహించేది లేదని.. అవసరమైతే పార్టీ నుండి సస్పడ్ చేస్తామని ఎమ్మెల్సీ రవిందర్ రావు అన్నారు. భూ బాధితులు ఎవరైనా నేరుగా టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు, కలెక్టర్ కు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ఇవాళ మహబూబాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ లాంటి అభివృద్ధి లేదన్నారు. గత 8 ఏండ్లలో  కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్టం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. 
ఆర్ధిక పరంగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్న బీజేపీ నాయకులకు తెలంగాణలో తిరిగే అర్హత లేదని విమర్శించారు. బీజేపీ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రజల్లో అలజడి సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎమ్మెల్సీ రవీందర్ రావు పేర్కొన్నారు.