![కరోనా వారియర్స్ ను ఎందుకు అవమానిస్తున్నారు?](https://static.v6velugu.com/uploads/2020/09/WORRIORS.jpg)
కేంద్రం పై ట్విటర్ వేదికగా మరోసారి విమర్శలు చేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. కరోనా వారియర్స్ ను ఇంతలా ఎందుకు అవమానిస్తున్నారని మోడీని ప్రశ్నించారు రాహుల్. కరోనా నియంత్రణలో ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న హెల్త్ సిబ్బంది డేటా కేంద్ర ఆరోగ్యశాఖ దగ్గర లేదన్నారు రాహుల్. డాక్టర్లు, నర్సులు, హెల్త్ వర్కర్లు కరోనా నియంత్రణలో ప్రాణం పెడుతున్నారని చెప్పారు. వారి శ్రమను గుర్తించకపోగా… కనీసం వారి వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర లేకపోవడం దారుణమన్నారు. చప్పట్లు కొట్టడం, దీపాలు వెలిగించడం కంటే వారి భద్రత, గౌరవం ముఖ్యమన్నారు రాహుల్.
హర్ సిమ్రత్ కౌర్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం