రఘునందన్ కు మద్దతుగా సతీమణి ప్రచారం

రఘునందన్ కు మద్దతుగా సతీమణి ప్రచారం

మెదక్​టౌన్, వెలుగు: మెదక్​పార్లమెంట్​అభివృద్ధి చెందాలంటే బీజేపీకి ఓటు వేసి ఎంపీగా రఘునందన్​రావును గెలిపించాలని ఆయన సతీమణి మాధవనేని మంజుల అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాయినగర్, వెంకట్​రావునగర్​ కాలనీల్లో ఆమె ఇంటింటి ప్రచారం చేపట్టారు. కార్యక్రమంఓ పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్,  మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బెండే వీణ,  సంగీత, ప్రవళిక, నాగరాజు, సుంకోజు రాజు తదితరులు పాల్గొన్నారు.