మరో మావోయిస్టు లొంగుబాటు

మరో మావోయిస్టు లొంగుబాటు

మావోయిస్టు రామన్న సతీమణి కామ్రేడ్ సావిత్రి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం సావిత్రి కిష్టారం మావోయిస్టు ఏరియా కమిటీకి సెక్రెటరీగా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టు దళ సభ్యురాలిగా ఉన్న సావిత్రిని 1994 లో  రామన్న పెళ్లి చేసుకున్నారు. మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రెటరీగా వ్యవహరించిన రామన్న వరంగల్ జిల్లా వాస్తవ్యుడు. మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్, తెలంగాణ పోలీసుల మోస్ట్ వాంటెడ్  మావోయిస్టుల జాబితాలో ఆయన పేరు ఉండేది.

అప్పట్లో రామన్నపై  పోలీసులు రూ.40 లక్షల రివార్డు ప్రకటించారు. 2019లో గుండెపోటుతో ఛత్తీస్ ఘడ్ అడవుల్లో ఆయన చనిపోయారు. రామన్న మరణించిన కొంత కాలానికే.. ఆయన కుమారుడు శ్రీకాంత్ పోలీసులకు సరెండర్ అయ్యారు. తాజాగా  కిష్టారం మావోయిస్టు ఏరియా కమిటీకి సెక్రెటరీగా వ్యవహరిస్తున్న రామన్న భార్య సావిత్రి కూడా పోలీసులకు లొంగిపోవడం గమనార్హం.