గిరిజన రిజర్వేషన్ల గురించి సీఎం దృష్టికి తీసుకెళ్తా

గిరిజన రిజర్వేషన్ల గురించి సీఎం దృష్టికి తీసుకెళ్తా

హైదరాబాద్ : సేవాలాల్ మహారాజ్ గిరిజన జాతి గర్వపడేలా సేవలందించారని అన్నారు మంత్రి ఈటల రాజేందర్. గిరిజన రిజర్వేషన్ల గురించి సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సద్గురు శ్రీ సేవాలాల్ మహారాజ్  282వ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్  రవీంద్రభారతిలో లంబాడి ఐక్యవేదిక  ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ ఎంపీ, బీజేపీ  నేత  వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. పూజారులను గౌరవించినట్లు..లంబడి పూజారులు కూడా గౌరవించే విధంగా కృషి చేస్తామన్నారు ఈటల రాజేందర్. లంబాడాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొస్తామన్నారు  వివేక్ వెంకటస్వామి. సేవాలాల్ జన్మదినాన్ని సెలవు దినంగా ప్రకటించాలని కోరారు రాములు నాయక్.