పిట్లంలో ఎమ్మెల్యే షిండే సుడిగాలి పర్యటన

పిట్లంలో ఎమ్మెల్యే షిండే సుడిగాలి పర్యటన

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

పిట్లం, వెలుగు: ఎమ్మెల్యే హన్మంత్​షిండే మంగళవారం పిట్లం మండలంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు.  మండలంలో పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని వివరించారు. సీఎం కేసీఆర్​ ఆశీర్వాదంతో నియోజకవర్గాన్ని విద్య, వైద్య రంగాలతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు తెలిపారు.

సాగునీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేయడానికి రూ. 476 కోట్లతో నాగమడుగు ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం పిట్లంలో పంచాయతీలకు స్పోర్ట్స్​కిట్లు పంపిణీ చేశారు. పిట్లంలో సెంట్రల్​ లైటింగ్​పనులకు, పిట్లం నుంచి సంగారెడ్డి జిల్లా కల్హేర్​ మండలానికి నిర్మించే రోడ్డు పనులను ప్రారంభించారు.

తిమ్మానగర్, మార్దండ, కంభాపూర్, చిన్నకొడప్​గల్, పోతిరెడ్డిపల్లి, రాంపూర్, గౌరారం గ్రామాల్లో మన ఊరు మన బడిలో నిర్మించిన కొత్త గదులు, బ్రిడ్జి పనులకు, గౌరారం తండాలో సెంట్రల్ లైటింగ్, రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కవిత, విజయ్, జడ్పీటీసీ అరికెల శ్రీనివాస్​రెడ్డి, వైస్​ఎంపీపీ లక్ష్మారెడ్డి,  బీఆర్ఎస్​మండలాధ్యక్షుడు వాసరి రమేశ్, సాయిరెడ్డి పాల్గొన్నారు.