సింగరేణి సీఎండీకి ఎక్స్టెన్షన్ వస్తుందా?.. రెండు కీలక బాధ్యతల్లో బలరాం

సింగరేణి సీఎండీకి ఎక్స్టెన్షన్ వస్తుందా?.. రెండు కీలక బాధ్యతల్లో బలరాం
  • డిసెంబర్ తో ఫైనాన్స్​డైరెక్టర్ గా ఏడేండ్లు, సీఎండీగా రెండేండ్లు పూర్తి 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి కాలరీస్​కంపెనీ సీఎండీ ఎన్ . బలరామ్​కు 
ఎక్స్​టెన్షన్ ఆందోళన​పట్టుకుంది. ఐఆర్​ఎస్​అధికారి బలరాం సింగరేణి ​ఫైనాన్స్​డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టి, డిసెంబర్ 5 నాటికి ఏడేండ్లు, సీఎండీగా 31తో రెండేండ్లు పూర్తి అవుతాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి ఎక్స్​టెన్షన్​ రాకపోతే సీఎండీగా కొనసాగడంపై సందిగ్దత నెలకొంటుంది.

 సింగరేణికి డిప్యూటేషన్​పై రావడానికి ముందు బలరాం సెంట్రల్​బోర్డ్​ఆఫ్​ఇన్​డైరెక్ట్​యాక్సెస్​అండ్​​ కస్టమ్స్​(సీబీఐసీ) ఆఫీసర్​గా పని చేశారు. 2018 డిసెంబర్​5న రెండేండ్ల వ్యవధితో ఆయన డిప్యూటేషన్​పై సింగరేణికి వచ్చారు.  ఇప్పటిదాకా ఎక్స్​టెన్షన్​పై కొనసాగుతుండగా.. అదనంగా పలు విభాగాల  బాధ్యతలను నిర్వహించారు. 

2024లో సీఎండీ శ్రీధర్​బదిలీ కాగా, పూర్తి అదనపు బాధ్యతలతో సీఎండీ అయ్యారు. ఫైనాన్స్​డైరెక్టర్​గా ఉన్న వారెవరూ రెండేండ్ల పాటు సింగరేణి సీఎండీగా కొనసాగలేదు. 40వేల కోట్ల టర్నోవర్​ఉన్న సంస్థలో ఏడేండ్లుగా పని చేస్తున్న బలరాంకు ఎనిమిదో ఏట కూడా కొనసాగేందుకు ఎక్స్​టెన్షన్​ వస్తుందా..? అనేది ఇప్పుడు కంపెనీలో చర్చనీయాంశమైంది.