వైన్స్ షాపులకు పోటెత్తిన జనం..భారీగా ట్రాఫిక్ జామ్

వైన్స్ షాపులకు పోటెత్తిన జనం..భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‌లో  రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ కానుండటంతో మద్యం ప్రియులు వైన్స్ షాపులకు పోటెత్తారు. బోనాల జాతర సందర్భంగా హైదరాబాద్‌లో జులై 16 ఆదివారం నుంచి 18 వ తేదీ వరకు మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ముఖ్యంగా ఎల్బీ నగర్ డివిజన్ ఫరిధిలో జులై 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18 వ తేదీ ఉదయం 6 గంటల వరకు రెండు రోజుల పాటు మూసివేస్తారు. దీంతో ముందుగా మద్యాన్ని కొనుగోలు చేసేందుకు ఎల్బీనగర్ వైన్స్ ల దగ్గరకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. 

ఎల్బీనగర్ ప్రధాన రోడ్డులోని వైన్స్ షాపులకు జనాలు పెద్ద ఎత్తున వచ్చారు. మద్యం కొనుగోలు చేసేందుకు లైన్లలో నిలబడ్డారు. కొందరు రోడ్డు పక్కనే నిర్లక్ష్యంగా తమ వాహనాలను పార్క్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయినా కూడా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోలేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.