విజేయుడు అభ్యర్థిత్వంపై జోక్యం చేసుకోలేం: హైకోర్ట్

విజేయుడు అభ్యర్థిత్వంపై జోక్యం చేసుకోలేం: హైకోర్ట్

హైదరాబాద్ వెలుగు: అలంపూర్‌‌ బీఆర్ఎస్ క్యాండిడేట్ విజేయుడు అభ్యర్థిత్వంపై దాఖలైన పిటిషన్‌‌ విషయంలో తాము  జోక్యం చేసుకోలేమని  హైకోర్టు వెల్లడించింది. నోటిఫికేషన్‌‌ వెలువడి, ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. పిటిషన్‌‌లో వాదనలను ముగించింది. గద్వాల్ జిల్లా పుల్లూరు గ్రామంలో  ఫీల్డ్ అసిస్టెంట్‌‌గా పనిచేస్తున్న విజేయుడు..తన ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే అలంపూర్‌‌ నుంచి నామినేషన్‌‌ వేశారు.

దీన్ని తిరస్కరించేలా రిటర్నింగ్‌‌ అధికారికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రసన్నకుమార్‌‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ అనిల్‌‌కుమార్‌‌ జూకంటి బెంచ్ బుధవారం విచారించింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న వేళ ఈ పిటిషన్‌‌లో జోక్యం చేసుకోలేమని వెల్లడించింది. వాదనలను ముగించింది.