
భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ20 సదస్సులో...ఆఫ్రికా యూనియన్కు జీ20లో శాశ్వత సభ్యత్వం కల్పించే విషయమై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదన చేయగా సభ్యదేశాలు ఆమోదాన్ని తెలిపాయి. అనంతరం భారత విదేశాంగ శాఖమంత్రి జైశంకర్ ఆఫ్రికన్ యూనియన్ (AU) ఛైర్పర్సన్ అజాలి అసోమానిని ఆయనకు కేటాయించిన కుర్చీలో కూర్చోబెట్టారు. దీంతో 20 సభ్యుల జీ20లో ఆఫ్రికా యూనియన్ చేరికతో 21మంది సభ్యులయ్యారు.
అనంతరం 55 దేశాల సమూహమైన ఆఫ్రికా యూనియన్ కి జీ20లో శాశ్వత సభ్యత్వం విషయాన్ని ప్రధాని మోదీ ప్రకటించగా.. సభ్యదేశాలు ఈ ప్రతిపాదనను ఆమోదించాయి. అనంతరం ప్రధాని మోదీ యూనియన్ ఆఫ్ కొమొరోస్ ప్రెసిడెంట్, ఆఫ్రికన్ యూనియన్ ఛైర్పర్సన్ అజాలి అసోమానిని జీ20 హై టేబుల్లో కూర్చోవాల్సిందిగా కోరారు. సభ్యదేశాల ప్రతినిధుల కరతాళధ్వనుల మధ్య భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ అసోమానీని తన సీటు వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు.
జీ20లో ఆఫ్రికా యూనియన్ దేశాల సభ్యత్వం విషయమై ప్రధాని మోదీ ఎంతో చొరవ చూపించారు. ఆఫ్రికా దేశాలకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కోరుతూ ఆయన జీ20 నాయకులకు గతంలో లేఖ రాశారు. జులైలో శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన ముసాయిదా ప్రకటనలో ఈ ప్రతిపాదనను కూడా చేర్చారు. సభ్య దేశాల ఆమోదంతో దాదాపు 130 కోట్ల జనాభా కలిగిన ఆఫ్రికా యూనియన్ దేశాలు జీ20 కూటమిలో చేరి ప్రపంచానికి మరింత చేరువైంది.
ALSOREAD:G20 Summit 2023: ముగిసిన జీ 20..మోదీని ప్రశంసించిన అతిథులు
అధ్యక్ష బాధ్యతలు బ్రెజిల్కు అప్పగింత
భారత అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు (G20 Summit) ముగిసింది. గ్రూపు తదుపరి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సల్వాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అప్పగించారు. ఈ మేరకు అధికారికంగా చిన్న సుత్తి వంటి గవెల్ను అయన చేతికి అందించారు.
The African Union officially joins the #G20 as a permanent member. Chair of the 2023 #G20 Summit, PM Modi of India, welcomed the AU during the Inaugural Session of the #G20, saying that this development will strengthen the #G20 and also strengthen the voice of the Global South.… pic.twitter.com/fyojy1fHuY
— Presidency | South Africa ?? (@PresidencyZA) September 9, 2023