
ఈ ఫోటో చూస్తుంటే వరి పొలంలో కలుపు తీస్తున్నట్లు.. పడిత్ భూమిలో గడ్డి కోస్తున్నట్లు అనిపిస్తోంది కదూ.. అలా అనుకుంటే పొరబడినట్లే.. ఇది వరి పొలం కాదు.. బీడు భూమీ కాదు.. ఆదిలాబాద్ జిల్లా అంకొలి గ్రామ శివారులోనీ ఓ రైతన్న పత్తి చేను. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో పత్తి చేనులో కలుపు ఏపుగా పెరిగింది.
ఆ కలుపును తీస్తూ మహిళలు ఇలా కనిపించారు. వర్షాలు, వరదలతో పంట చేన్లు కొట్టుకుపోయి కొందరు రైతులు నష్టపోగా.. మరికొందరు రైతులు ఇలా ఉన్న పంట చేలను కాపాడుకోవడానికి అవస్థలు పడుతున్నారు. పంట ఎదుగుదలకు పెరిగిన గడ్డి ఆటంకం కాగా.. దానిని తొలగించడానికి రైతు అదనంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తోంది.
- వెలుగు ఫోటోగ్రాఫర్, ఆదిలాబాద్