మల్టీ నేషనల్ కంపెనీ పేరుతో సోయా డీ ఆయిల్డ్ మెటీరీయల్ ను సప్లై చేయించుకొని తిరిగి డబ్బులు చెల్లించకుండా మోసాలకు పాల్పడుతున్న మహిళను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కోదనుకుదురుకు చెందిన కోడూరు నీరజ(36) ఆమె బంధువైన కోడూరు రామతో కలిసి సోనక్ మల్టీ నేషనల్ కంపెనీ పేరుతో సోషల్ మీడియాతో పాటు గూగుల్ లో ప్రకటనలు ఇస్తున్నారు. నెదర్లాండ్ లోని కంపెనీతో అనుబంధంగా ఉన్నామని నమ్మిస్తూ మోసాలకు తెరలేపారు. ప్రకటనలు చూసి నమ్మిన నాగోలుకు చెందిన వీఎస్ ఎంటర్ ప్రైజెస్ కంపెనీ మేనేజింగ్ పార్ట్నర్ కవితచిన్నస్వామి వారితో ఆన్లైన్లోనే ఒప్పందం కుదుర్చుకుంది. తన వద్ద ఉన్న మెటీరియల్ సప్లై చేసేందుకు అంగీకరించింది. ముందుగా మెటీరీయల్ సప్లై చేస్తే అగ్రిమెంట్ ప్రకారం 60 రోజుల్లో డబ్బులు చెల్లించేట్లు మాట్లాడుకున్నారు. ఇలా సుమారు 90 లక్షల విలువైన మెటీరియల్ ను నీరజ, రామకు సప్లయ్ చేసింది. అగ్రిమెంట్ ప్రకారం గడువు ముగియడంతో బాధితులు నీరజను కాంటాక్ట్ చేశారు. నీరజ కానీ కంపెనీలో పనిచేసే ఇతరులు ఎవరూ రెస్పాండ్ కాకపోవడంతో అనుమానం వచ్చి కవితచిన్నస్వామి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నీరజను అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా సైబర్ క్రైమ్ సీఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి ఆన్లైన్అమ్మకాలను గుడ్డిగా నమ్మి మోసపోవద్దని సూచించారు.
మల్టీ నేషనల్ కంపెనీ పేరుతో మోసం
- ఆంధ్రప్రదేశ్
- June 30, 2019
లేటెస్ట్
- తెలంగాణ కేబీనేట్ భేటీ వాయిదా
- ఎంతమందిని జైల్లో పెడతావో చూస్తాం: మోదీపై కేజ్రీవాల్ ఫైర్
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- ప్రధాని మోదీ ప్రజలను రెచ్చగొడుతున్నారు: మల్లికార్జున్ ఖర్గే
- RCB vs CSK: మహా సమరం.. మిస్ అవ్వకండి: కీలక మ్యాచ్లో టాస్ ఓడిన బెంగుళూరు
- స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించిన కేజ్రీవాల్
- కిర్గిస్థాన్లో విదేశీ విద్యార్థులపై దాడులు.. బయటకు రావొద్దని విదేశాంగ శాఖ హెచ్చరికలు
- పల్నాడుకు మహిళా ఎస్పీ.. ఎవరీ మల్లికా గార్గ్.. స్పెషాలిటీ ఏంటి..
- 300 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి.. కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన భక్తుడు
- మీరే పెద్ద స్మగ్లర్లు.. అటవీ ఆఫీసర్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఫైర్
Most Read News
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!