పురిటినొప్పులతో నడిరోడ్డుపైనే ప్రసవం

పురిటినొప్పులతో నడిరోడ్డుపైనే ప్రసవం

సంగారెడ్డి జిల్లా:  నవమాసాలు నిండిన నిండు గర్భిణిని కుటుబ సభ్యులు కాన్పు కోసం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. పురిటి నొప్పులతో నడిరోడ్డుపైనే మగబిడ్డకు జన్మనిచ్చిన ఘటన రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి పై  అశోక్ నగర్ వద్ద చోటు చేసుకుంది.  ఇస్నాపూర్ కు చెందిన బబిత అనే గర్భిణి పురిటి నొప్పులతో నడి రోడ్డు పై నరక యాతన అనుభవిస్తుంటే.. రోడ్డుపై వెళ్తున్న వారు తమకేమీ పట్టనట్లు చోద్యం చూశారే తప్ప ఎవరూ స్పందించలేదు. 

రోడ్డుపై వెళ్తున్న వారు చూసుకుంటూ వెళ్తుండగా.. కుటుంబ సభ్యులే దగ్గరలో ఉన్న దుకాణాల వద్దకు వెళ్లి ప్యాకింగ్ అట్టలను సేకరించి గర్భిణికి అండగా నిలిచారు. కొంతసేపటి తర్వాత గర్భిణి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీ, బిడ్డలను కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం పటాన్ చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.