కొంపముంచిన నో బాల్.. వరల్డ్ కప్ నుంచి భారత్ ఔట్

 కొంపముంచిన నో బాల్.. వరల్డ్ కప్ నుంచి భారత్ ఔట్
  • కొంపముంచిన నో బాల్.. వరల్డ్ కప్ నుంచి భారత్ ఔట్
  • చివరి బాల్ వరకు ఉత్కంఠ.. కీలక మ్యాచ్ లో భారత్ ఓటమి


మహిళల వరల్డ్ కప్ నుంచి టీమిండియా నిష్క్రమించింది. సెమీస్ బెర్తు కోసం చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో చివరి బాల్ వరకు పోరాడిన భారత్ కు నిరాశే మిగిలింది. ఆఖరి ఓవర్లో సౌతాఫ్రికా విక్టరీకి 6 బాల్స్ లో 7 రన్స్ కావాల్సి ఉండగా.... టీమిండియా బౌలర్ దీప్తి శర్మ చేసిన చిన్న పొరబాటు మ్యాచ్ ను కోల్పోయేలా చేసింది. దీంతో టీమిండియా వరల్డ్ కప్ ఆశలు ముగిశాయి.  దీప్తి శర్మ వేసిన బాల్ ని సౌతాఫ్రికా బ్యాటర్ డుప్రీజ్ లాంగాన్ దిశగా కొట్టగా, అక్కడ హర్మన్ ప్రీత్ కౌర్ క్యాచ్ పట్టింది. దాంతో భారత శిబిరంలో సంబరాలు మిన్నంటాయి. కానీ.. ఆ సంతోషం భారత ప్లేయర్లకు సెకన్లపాటే అయ్యింది. అది నోబాల్ అని అంపైర్ ప్రకటించడంతో, సౌతాఫ్రికా టీమ్ కు రన్ రావడంతో పాటు ఫ్రీహిట్ కూడా లభించింది. ఇక చివరి బాల్ కి 1 రన్ అవసరం కాగా, సౌతాణాఫ్రికా ఈజీగా సాధించింది.  ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 274 పరుగులు చేశారు. సౌతాఫ్రికా కూడా సరిగ్గా అన్నే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.

దీంతో భారత్ కి  ఓటమి తప్పలేదు. భారత మహిళలు గ్రౌండ్ లో కన్నీటిపర్యంతమయ్యారు. షెపాలీ వర్మ, స్మృతి, మిథాలీరాజ్ హాఫ్ సెంచరీలతో చెలరేగినా ఓటమి తప్పలేదు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ లో ఓపెనర్ లారా వోల్వార్ట్ 80, లారా గూడాల్ 49, మిగ్నాన్ డుప్రీజ్ 52 నాటౌట్, మరియానే కాప్ 32 రన్స్ తో రాణించారు. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 2, హర్మన్ ప్రీత్ కౌర్ 2 వికెట్లు తీశారు. ఈ విజయంతో సౌతాఫ్రికా వరల్డ్ కప్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ ఫలితం అటు వెస్టిండీస్ అమ్మాయిలకు కూడా కలిసొచ్చింది. వారు కూడా సెమీఫైనల్లో అడుగుపెట్టారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఇప్పటికే సెమీస్ చేరాయి. సెమీస్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో వెస్టిండీస్, ఇంగ్లండ్ తో సౌతాఫ్రికా తలపడనున్నాయి. మార్చి 30, 31 తేదీల్లో సెమీస్ మ్యాచ్ లు జరగనుండగా, ఏప్రిల్ 3న ఫైనల్ జరగనుంది.