Under19 T20 Worldcup : ఫైనల్కు చేరిన టీమిండియా

Under19 T20 Worldcup : ఫైనల్కు చేరిన టీమిండియా

అండర్19 టీ20 ప్రపంచకప్ లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. న్యూజిలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్ లో అడుగుపెట్టారు. మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లకు న్యూజిలాండ్ జట్టుని 107కి ఆలౌట్ చేసింది. 108 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 14.2  ఓవర్లలోనే మ్యాచ్ ని ముగించేసింది. ఓపెనర్ శ్వేతా సెహ్రావత్ (61, 45 బంతుల్లో) అదరగొట్టింది. సౌమ్య తివారి (22, 26 బంతుల్లో) విజయంలో కీలక పాత్ర పోషించింది. 
 
భారత బౌలర్ల దాటికి కివీస్ ఓపెనర్లు అన్నా బ్రౌనింగ్ (1), ఎమ్మా మెక్లియోడ్ (2) అరంభంలోనే చేతులెత్తేశారు. తర్వాత వచ్చిన జార్జియా ప్లిమ్మర్ (35), ఇసాబెల్లా గాజ్ (26) తప్ప మిగిలిన బ్యాటర్లంతా ఫెయిల్ అయ్యారు. పార్షవి చోప్రా (4 ఓవర్లలో 3 వికెట్లు) దాటికి కివీస్ జట్టు తోక ముడిచింది. కెప్టెన్ షఫాలీ వర్మ (4 ఓవర్లలో 7 పరుగులు 1 వికెట్) రాణించింది. టిటాస్ సాధు, మన్నత్ కశ్యప్, అర్చన దేవికి ఒక్కో వికెట్ దక్కింది.