
విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్వచ్చే నెల 4 నుంచి 26 వరకు జరుగుతుందని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపాడు. ఈ టోర్నీలో మొత్తం 22 మ్యాచ్లు జరగనుండగా, ఈ మ్యాచులన్నింటినీ ముంబైలోని బ్రబౌర్న్, డీవై పాటిల్ స్టేడియాల్లో నిర్వహించనున్నారు. గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్టీమ్స్మధ్య తొలి మ్యాచ్తో టోర్నీకి తెరలేవనుంది. లీగ్ దశలో టాప్లో నిలిచిన టీం, డైరెక్ట్గా ఫైనల్కు చేరుతుంది. రెండు, మూడు ప్లేస్ల్లో నిలిచిన టీమ్స్ ఫైనల్ బెర్త్ కోసం పోటీపడతాయి. కాగా, ఐదు జట్లు బరిలోకి దిగుతున్న ఈ టోర్నీ కోసం ఈ నెల 13న ప్లేయర్ల ఆక్షన్ జరగనుంది.