Women IPL:మార్చి 4 నుంచి డబ్ల్యూపీఎల్

Women IPL:మార్చి 4 నుంచి డబ్ల్యూపీఎల్

విమెన్స్​ ప్రీమియర్​ లీగ్​ (డబ్ల్యూపీఎల్​) తొలి సీజన్​వచ్చే నెల 4 నుంచి 26 వరకు జరుగుతుందని ఐపీఎల్​ చైర్మన్​ అరుణ్​ ధుమాల్​ తెలిపాడు. ఈ టోర్నీలో మొత్తం 22 మ్యాచ్​లు జరగనుండగా, ఈ మ్యాచులన్నింటినీ ముంబైలోని బ్రబౌర్న్​, డీవై పాటిల్​ స్టేడియాల్లో నిర్వహించనున్నారు. గుజరాత్​ జెయింట్స్, ముంబై ఇండియన్స్​టీమ్స్​​మధ్య తొలి మ్యాచ్​తో టోర్నీకి తెరలేవనుంది. లీగ్​ దశలో టాప్​లో నిలిచిన టీం,​ డైరెక్ట్​గా ఫైనల్​కు చేరుతుంది. రెండు, మూడు ప్లేస్​ల్లో నిలిచిన టీమ్స్ ఫైనల్​ బెర్త్​ కోసం పోటీపడతాయి. కాగా, ఐదు జట్లు బరిలోకి దిగుతున్న ఈ టోర్నీ కోసం ఈ నెల 13న ప్లేయర్ల ఆక్షన్​ జరగనుంది.