హైదరాబాద్, వెలుగు: కోవిడ్ కారణంగా 47 శాతం మహిళలు తమ ఉద్యోగాలు కోల్పోయారని, పురుషులు 7శాతం మాత్రమే ఉద్యోగాలు కోల్పోయారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కంపెనీలు తిరిగి మహిళలకు జాబ్స్ ఇవ్వాలని సూచించారు. హైటెక్స్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రైజెస్ ఇండియా సంయుక్తంగా మహిళా వ్యాపారులను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న బిజినెస్ ఉమెన్ ఎక్స్పో 2022 రెండవ ఎడిషన్ శుక్రవారం మాదాపూర్ హైటెక్స్లో ప్రారంభమైంది. ఈ ఎక్స్పోను ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో 21 శాతం మంది మహిళలే ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. ప్రపంచ సగటు 47% మహిళా ఉద్యోగులు ఉంటే యూఎస్ఏ లో 86% మహిళా ఉద్యోగులు ఉన్నారని, మనదేశంలోనూ మహిళల వాటా 86%కి చేరుకుంటే, దేశ జీడీపీకి లాభమని అన్నారు.