
అంబర్ పేటలోని ఆజాద్ నగర్లో ఓ మహిళ హత్యకు గురైంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. హత్యకు గురైంది బేగం అనే మహిళగా గుర్తించారు. కుటుంబ కలహాల వల్లే ఈ హత్య జరగవచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.