నాసిరకంగా రోడ్డు వేశారని నిరసన

నాసిరకంగా రోడ్డు వేశారని నిరసన

అమ్రాబాద్, వెలుగు: దోమలపెంట గ్రామంలో ఇటీవల వేసిన బీటీ రోడ్డు నాసిరకంగా ఉండడంతో శనివారం గ్రామానికి చెందిన మహిళలు నిరసన తెలిపారు. రోడ్లు పెచ్చులు లేవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.94 లక్షలతో నిర్మించిన రోడ్డు నాసిరకంగా వేయడంతో పెచ్చులు ఊడుతున్నాయని పేర్కొన్నారు.

ఈ విషయమై కాంట్రాక్టర్ ను నిలదీస్తే సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్నాడని తెలిపారు. కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని రోడ్డుకు రిపేర్లు చేయాలని డిమాండ్ చేశారు. పుష్ప, బీబీ, యాదమ్మ, నూక రత్నం, శివలీల ఉన్నారు.