
వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయం శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారికి మంగళవారం మహిళలు బోనాలు, మొక్కులు సమర్పించారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి.
ఒక్కో మహిళ బోనం తీయడానికి సుమారు 2 గంటల పాటు సమయం పట్టింది. బోనంతో పాటు మహిళలు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు.