బియ్యం గింజలపై రామనామం

బియ్యం గింజలపై రామనామం

శ్రీరామునిపై తనకున్న భక్తిని వినూత్నంగా తెలిపారు ఓ భక్తురాలు. ప్రతి ఏటా బియ్యపు గింజలపై రామ నామాన్ని రాస్తున్నారు  జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఇల్లూరి శ్రీ లక్ష్మీ. ఈ ఏడాది 20 వేల 116 బియ్యం గింజలపై రామ నామాన్ని రాశారు శ్రీలక్ష్మి. ఇలా 8 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు 3 లక్షల 50 వేల బియ్యపు గింజలపై రామయ్య నామాన్ని రాసి రికార్డు సృష్టించారు. రామ నామాన్ని జపిస్తూ భక్తితో రాసిన ఈ బియ్యపు గింజలను శ్రీరామ నవమి నాడు ఉపయోగించే తలంబ్రాల కోసం ఇస్తామన్నారు. గతంలో ఒక సంవత్సరం 50 వేలు, మరో ఏడాది లక్షా 50 వేల బియ్యపు గింజలపై రామ నామాన్ని రాసి  భద్రాచలంలో తలంబ్రాలుగా సమర్పించినట్లు తెలిపారు.