బోయిన్ పల్లిలో పెన్​ గ్రూప్​ ఆధ్వర్యంలో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ 

బోయిన్ పల్లిలో పెన్​ గ్రూప్​ ఆధ్వర్యంలో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ 
  • సామల సుగుణను  సత్కరించిన సభ్యులు 

పద్మారావునగర్, వెలుగు: లింగ వివక్ష లేని సమాజంతో మహిళలకు సమన్యాయం కలుగుతుందని, గతంతో పోల్చితే ప్రస్తుతం అన్ని రంగాల్లో మహిళల ప్రాధాన్యం పెరుగుతోందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ఉమెన్స్​డే పురస్కరించుకొని పెన్​గ్రూప్​ ఆధ్వర్యంలో ఆదివారం సికింద్రాబాద్​ బోయిన్ పల్లిలోని  రాజరాజేశ్వరి గార్డెన్‌‌‌‌లో సెలబ్రేషన్స్​ నిర్వహించారు.  ఈ సందర్భంగా విశిష్ట సేవలందించిన మహిళలను ఘనంగా సత్కరించారు.

 అంతర్జాతీయ మెజిషీయన్, సెంట్రల్ ​ఫిల్మ్​ సెన్సార్​ బోర్డు మెంటర్​ సామల వేణు మాతృమూర్తి సామల సుగుణను పెన్​గ్రూప్​ ప్రతినిధులు, ముఖ్య అతిథులు ఘనంగా సత్కరించారు. సామల సుగుణ నేటి తరం మహిళలకు ఆదర్శమని కొనియాడారు.  ప్రముఖ మెజిషీయన్​సామల వేణు, ఈవెంట్​ చైర్మన్​ వంగల శైలజ, కార్పొరేటర్​ కొంతం దీపిక, పల్లవి గ్రూప్​ ఆఫ్​ ఇనిస్టిట్యూషన్స్​అధినేత మల్కా పల్లవి, మహిళలు పాల్గొన్నారు.