ప్రజా సంక్షేమం కోసం పని చేస్తా: బండి సంజయ్

ప్రజా సంక్షేమం కోసం పని చేస్తా: బండి సంజయ్

భారీ మెజార్టీతో గెలిపించిన కరీంనగర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. ఎంపీగా గెలిచిన తర్వాత కరీంనగర్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. తన పై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్నీ వమ్ము చేయకుండా పేద ప్రజల ఉన్నతి కోసం పని చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలతో పాటు, రాజన్న ఆశీస్సులతో గెలిచాని…వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ కలలు కన్న పాలనలో బాగస్వామ్యం అవుతానని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా… అన్ని పార్టీల నాయకులతో కలిసి అభివృద్ధి కోసం పాటుపడుతానన్నారు. బీజేపీ పార్టీ ఎలాంటి అవకాశం కల్పించినా చేసేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు తెలపారు బండి సంజయ్.