బ్లడ్ డొనేట్ చేస్తే బలహీనపడి నీరసించిపోతారా ? రక్తదానంపై ఆసక్తికర విషయాలు ఇవి..

బ్లడ్ డొనేట్ చేస్తే బలహీనపడి నీరసించిపోతారా ? రక్తదానంపై ఆసక్తికర విషయాలు ఇవి..

‘రక్తం ఇవ్వండి..ఆశ కల్పించండి.. కలిసి మనం కాపాడుకుందాం’ అనే థీమ్​తో ఈ ఏడాది ప్రపంచ రక్తదాతల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఏటా జూన్​ 14న ప్రపంచ దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాయి. ఒక్కో ఏడాది ఒక్కో లక్ష్యం పెట్టుకుని ఆ ప్రకారం కార్యక్రమాలు తలపెట్టి రక్తదాతలకు కృతజ్ఞతలు ప్రకటిస్తాయి. 1901లో ఆస్ట్రేలియాకు చెందిన నోబెల్ విజేత కార్ల్ లాండ్స్ స్టీనర్ తొలిసారిగా రక్తాన్ని వర్గీకరించారు. దీంతో ఆయన జయంతి గుర్తుగా.. 2004లో మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని అన్ని దేశాల్లోనూ నిర్వహించారు.

రక్తదానం మీద చాలామందికి అపోహలున్నాయి. వాస్తవాలు తెలుసుకోకుండా భయపడి వెనక్కి తగ్గేవారు అనేకులు ఉన్నారు. రక్తందానం చేస్తే బలహీనపడి నీరసించిపోతారన్న అపోహ ఉంది. అయితే,  అలాంటి పరిణామాలు ఏమీ ఉండవు. బలహీనత అసలే ఉండదు. ఎప్పటిలా ఆరోగ్యంగానే ఉంటారు. ఎప్పటి మాదిరిగానే అన్ని రకాల శ్రమతో కూడిన పనులు చేసుకోవచ్చు. రక్తదాన  సమయంలో నొప్పి కలుగుతుందన్న వాదన కూడా సరికాదు.

రక్తదానం ఏటా మిలియన్ల మంది ప్రాణాలను కాపాడతాయి. ముఖ్యంగా శిశు మరణాలు తగ్గుతాయి. తల్లి ఆరోగ్యం కుదుటపడుతుంది. అంతేకాకుండా ప్రాణాంతక వారసత్వ రుగ్మతలైన హిమోఫిలియా, తలసేమియా, కేన్సర్, రక్తస్రావం వంటి సంక్రమిత పరిస్థితులతో అల్లాడిపోతున్న రోగుల ఆయుర్దాయం, జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది. రక్త దానం చేసిన 48 గంటల కన్నా తక్కువ సమయంలోనే శరీరం కొత్త రక్తకణాలను అందిస్తుంది.

రక్తదానం వల్ల దాతలు తమ ఐరన్ స్థాయిలను, ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. హృదయ సంబంధ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. ఆరోగ్యంగా ఉన్న 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు రక్తదానం చేయడానికి అర్హులు. ఒకసారి రక్తం ఇచ్చిన తర్వాత మహిళలైతే ఆరు నెలలు, పురుషులు మూడు నెలల అనంతరం మళ్లీ రక్తం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి రక్తదానం చేస్తే ముగ్గురికి ప్రాణదానం చేసినట్టవుతుంది.

 

జి. యోగేశ్వర రావు, సీనియర్ జర్నలిస్ట్