Women IPL: విమెన్ ఐపీఎల్ వేలం డేట్ ఫిక్స్

Women IPL: విమెన్ ఐపీఎల్ వేలం డేట్ ఫిక్స్

బీసీసీఐ.. ఉమెన్ ప్రీమియర్ లీగ్ (WPL) మొదటి ఎడిషన్ కోసం వేలం తేదీని ప్రకటించింది. ఫిబ్రవరి 13న ముంబైలో వేలం నిర్వహించనున్నారు. ఈ మేరకు బీసీసీఐ ఫ్రాంఛైజీలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్ తో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్ లో బీసీసీఐ అధికారి ఈ వార్తను తెలియజేశాడని ఇన్ సైడ్ స్పోర్ట్స్ నివేదికలో తెలిపింది. ఈ టోర్నీలో మొత్తం ఐదు జట్లు తలపడనుండగా, వాటికి సంబంధించిన బిడ్ ముగిసిన విషయం తెలిసిందే. 

డబ్ల్యూపీఎల్ మ్యాచ్ లు ముంబైలోని రెండు వేదికలపై జరగనున్నాయి. బ్రబౌర్న్ స్టేడియం, డీవై పాటిల్ స్టేడియాలు ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. అదానీ గ్రూప్, క్రాపీ గ్లోబల్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచేజిలు బిడ్  ద్వారా జట్లను కొనుగోలు చేసుకున్నాయి.