WPL Auction : వేలంలో అత్యధిక ధర స్మృతీ మందాన రూ. 3.40 కోట్లు

WPL Auction : వేలంలో అత్యధిక ధర స్మృతీ మందాన రూ. 3.40 కోట్లు

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్.. డబ్ల్యూపీఎల్ లో టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మందానా అత్యధిక ధర పలికింది. ఆమె కోసం ముంబై, ఆర్సీబీ జట్లు పోటీ పడ్డాయి. చివరకు రూ.3.40 కోట్లకు ఆర్సీబీ స్మృతిని దక్కించుకుంది. టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ను రూ.1.80 కోట్లకు ముంబై దక్కించుకుంది. హర్మన్ కోసం ముంబై, యూపీ వారియర్స్ పోటీ పడ్డాయి. ఆస్ట్రేలియా క్రికెటర్స్ ఆష్లీ గార్డనర్‌‌ను రూ. 3.20 కోట్లకు గుజరాత్ జెయింట్స్‌ సొంతం చేసుకుంది. మరో ఆసీస్ ప్లేయర్ ఎలిస్ పెర్రీని రూ.1.70 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది. న్యూజిలాండ్ క్రికెటర్ సోఫీ డివైన్‌ కనీస ధర రూ.50 లక్షలకు ఆర్సీబీ సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సోఫీ ఎక్లెస్టోన్‌ కోసం యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడగా రూ.1.80 కోట్లకు యూపీ వారియర్స్ సొంతం చేసుకుంది.

ముంబైలో మధ్యాహ్నం 2:30 మహిళా ఐపీఎల్ (WPL) వేలం ప్రారంభం అయింది. ఇదే ప్రారంభ సీజన్ కావడంతో టాప్ ప్లేయర్లను దక్కించుకునేందుకు ఫ్రాంచేజీలు పోటీ పడుతున్నాయి. ఈ వేలంలో మొత్తం 409 మంది ప్లేయర్లు ఉండగా.. అందులో 90 మందిని ఫ్రాంచైజీలు కొనుగోలు చేయనున్నాయి. వేలంలో ఉన్నవారిలో 246 మంది టీమిండియా ప్లేయర్లు కాగా.. 163 మంది ఫారిన్ ప్లేయర్లు ఉన్నారు. ప్రతీ టీం గరిష్టంగా ఒక ప్లేయర్ పై రూ.12 కోట్లు ఖర్చు చేసే అవకాశముంది. ఆరుగురు విదేశీ ఆటగాళ్లతో సహా మొత్తం 18 మందిని వేలంలో కొనుక్కోవచ్చు. ఒక్కో ఫ్రాంచైజీ కనీసం 15 మందినైనా జట్టులోకి తీసుకోవాలి.

ఒక ప్లేయర్ కనీస ధర రూ.10 లక్షలతో మొదలవుతుంది.  ఆ తర్వాత 10లక్షల చొప్పున పెరుగుతూ రూ.50 లక్షల విభాగాలున్నాయి. మొదటి సెట్‌లో వేలానికి ఉన్న ప్లేయర్లు 

సోఫీ డివైన్ –న్యూజిలాండ్
సోఫీ ఎక్లెస్టోన్ – ఇంగ్లాండ్
ఆష్లీ గార్డనర్ - ఆస్ట్రేలియా
హర్మన్‌ప్రీత్ కౌర్ - భారత్
స్మృతి మంధాన - భారత్‌
హేలీ మాథ్యూస్ - వెస్టిండీస్
ఎలిస్ పెర్రీ - ఆస్ట్రేలియా