
న్యూఢిల్లీ: వరల్డ్ చాంపియన్షిప్ ట్రయల్స్ను ఆగస్టు 20లోపు నిర్వహించొద్దని ఆసియా గేమ్స్ ట్రయల్స్లో నెగ్గిన రెజ్లర్లు ఐవోఏ అడ్హక్ ప్యానెల్, స్పోర్ట్స్ మినిస్ట్రీకి లెటర్ రాశారు. బరువు తగ్గే ప్రయత్నంలో గాయాల బారిన పడే చాన్స్ ఉంటుందని వెల్లడించారు. ఆగస్టు 10న వరల్డ్ ట్రయల్స్ను నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. వాటికి ప్రిపేర్ అయ్యేందుకు చాలా తక్కువ టైమ్ ఉందని, 20వ తేదీ వరకు తమకు సమయం ఇవ్వాలని రెజ్లర్లు కోరుతున్నారు.