తాను మళ్లీ టీంఇండియా జట్టులోకి వచ్చే అవకాశాలు లేనట్టేనని క్రికెటర్ వృద్ధిమాన్ సాహా ఆవేదన వ్యక్తం చేశాడు. డిసెంబర్ 2021లో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన సాహా ... ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లలో అంచనాలకు మించి రాణించాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన సాహా.. ఓపెనర్ గా బరిలోకి దిగి 11 మ్యాచ్ లలో 31.70 సగటుతో మరియు 122.39 స్ట్రైక్ రేట్తో 317 పరుగులు చేశాడు. దీనితో ఇంగ్లండ్ టూర్ తో పాటు ఐర్లాండ్ తో రెండు టీ20లకు ఎంపిక చేసే జట్టులో తనకి చోటు లభిస్తుందని అనుకున్నాడు. కానీ సెలక్టర్లు తనని పక్కన పెట్టడంతో సాహా ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే జట్టులో దక్కకపోయినా తాను మాత్రం క్రికెట్ ఆడటం మాననని, ఆటను ప్రేమించినంత వరకు క్రికెట్ ఆడుతూనే ఉంటానని సాహా చెప్పుకొచ్చాడు.