విలన్ గా మారబోతున్న రచయిత

విలన్ గా మారబోతున్న రచయిత

writer-abburi-ravi-first-look-launch-by-trivikram-from-operation-gold-fish-movieరచయితగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన అబ్బూరి రవి ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ సినిమాతో విలన్ పాత్రలో నటిస్తున్నాడు.. ‘వినాయకుడు’, ‘విలేజ్ లో వినాయకుడు’, ‘కేరింత’ వంటి సెన్సిబుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన అడివి సాయికిరణ్ ఈ చిత్రానికి డైరెక్టర్. వాస్తవ ఘ‌ట‌న‌ల ఆధారంగా క‌ల్పిత కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో ఎన్‌.ఎస్‌.జి క‌మాండో అర్జున్ పండిట్ పాత్రలో ఆది సాయికుమార్‌, ‘ఎయిర్ టెల్’ మోడ‌ల్ శ‌షా చెత్రి హీరోయిన్ గా నటిస్తోంది. ఆపరేషన్ గోల్డ్ ఫిష్ లోని అబ్బూరి రవి ఫస్ట్ లుక్ ను త్రివిక్రమ్ చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ సందర్బంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ..
అబ్బూ (అబ్బూరి రవి)ని విలన్ గా పరిచయం చేయడం నాకు సంతోషంగా ఉంది. నేనూ, అబ్బూరి రవి కలిసి చదువుకున్నాం. నాకు ఇష్టమైన స్నేహితుడు. కాశ్మీరీ పండిట్ ల సమస్య మీద సాయి కిరణ్ గారు సినిమా చేస్తున్నట్టు అబ్బూరి రవి నాకు ఐదారు నెలల క్రితం చెప్పాడు. సాయి కిరణ్ గారు కాశ్మీర్ లో నిజమైన పండిట్ కుటుంబాలను కలిసి, వాళ్ళను ఇంటర్వ్యూలు చేసి.. వాళ్ళ తాలూకూ నిజమైన కష్టాలను, బాధలను తెరకెక్కించడం అభినందనీయం అని అన్నారు.

writer-abburi-ravi-first-look-launch-by-trivikram-from-operation-gold-fish-movie

అబ్బూరి రవి మాట్లాడుతూ “ఆపరేషన్ గోల్డ్ ఫిష్’లో నా లుక్ త్రివిక్రమ్ చేతుల మీదుగా విడుదల కావడం నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే.. నన్ను రచయితగా లాంచ్ చేసింది త్రివిక్రమే. నన్ను సినిమాలకు పరిచయం చేసిందీ తనే. ఇప్పుడు ఆర్టిస్టుగా పరిచయం చేసిందీ తనే. త్రివిక్రమ్ లేకుండా నా కెరీర్ గురించి మాట్లాడటం అనేది జరిగే పని కాదు. నా ప్రతి అడుగులోనూ త్రివిక్రమ్ ఉంటాడు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా… ఏం ఆలోచించినా.. తన సలహాలు నాకు ఉంటాయి అని చెప్పాడు.