
గాబెరా: విమెన్స్ టీ20 వరల్డ్కప్లో ఇండియా కీలక పోరుకు సిద్ధమైంది. శనివారం జరిగే గ్రూప్–బి లీగ్ మ్యాచ్లో బలమైన ఇంగ్లండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్లో నెగ్గిన టీమ్ నేరుగా సెమీస్కు వెళ్లే చాన్స్ ఉండటంతో.. ఇరుజట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఆడిన రెండు మ్యాచ్ల్లో నెగ్గిన టీమిండియా ఖాతాలో 4 పాయింట్లు ఉన్నాయి. ఇంగ్లండ్ కూడా 4 పాయింట్లతో టాప్ ప్లేస్లో కొనసాగుతున్నది. ఇంగ్లండ్తో పోరులో గెలవాలంటే ఇండియా టాప్ ఆర్డర్ శక్తికి మించి శ్రమించాలి. ఓపెనింగ్లో షెఫాలీ వర్మ, స్మృతి మంధానా చెలరేగితే భారీ స్కోరును ఆశించొచ్చు. జెమీమా, కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఫామ్లో ఉండటం కలిసొచ్చే అంశం. ఇంగ్లిష్ స్పిన్ త్రయం చార్లీ డీన్, సోఫీ ఎకెల్స్టోన్, సారా గ్లెన్ను దీటుగా ఎదుర్కొంటే ఈ మ్యాచ్లో ఇండియా విజయం ఖాయం. బౌలింగ్లో పూజా వస్త్రాకర్, రేణుకా సింగ్ మెరిస్తే ఇండియా కష్టాలు తప్పినట్లే. డెత్ ఓవర్స్లో దీప్తి శర్మ కీలకం కానుంది. ఈ మ్యాచ్లో గెలవాలంటే ఇండియా ఫీల్డింగ్లోనూ మెరవాలి. మరోవైపు ఇంగ్లండ్ కూడా యంగ్, అనుభవం కలిగిన ప్లేయర్లతో స్ట్రాంగ్గా ఉంది. క్యాప్సే, లౌరెన్ బెల్, నైట్, కేథరిన్ బ్రంట్, నాట్ బ్రంట్, డానియల్ వ్యాట్పై భారీ అంచనాలు ఉన్నాయి.