భలే మంచి చౌక బేరం, మంచి తరుణం మించినా దొరకదు అంటోంది షావోమీ. తమ కంపెనీ 5 వ వార్షికోత్సవం సందర్భంగా ‘ఎంఐ టర్న్స్ 5’ పేరుతో సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్లో కొన్ని ఉత్పత్తుల్ని సగం ధరకే అమ్ముతోంది. ముఖ్యంగా ఈ సేల్ రెడ్ మీ వై3 స్మార్ట్ ఫోనును సగం ధరకే అందించనుంది. ఫోను తో పాటుగా ఎంఐ బిజినెస్ క్యాజ్యువల్ బ్యాక్ప్యాక్, ఎంఐ సౌండ్బార్, ఎంఐ 32 అంగుళాల టీవీలను బంపర్ ఆఫర్ లో హాఫ్ రేట్ కే అందించనుంది. ఈ ఆఫర్ రేపటి వరకే(జూలై 25న చివరి రోజు).
జూలై 25 సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సేల్లో రూ.11,999 విలువైన రెడ్మీ వై3 స్మార్ట్ఫోన్ను రూ.4999.50 ధరకే పొందొచ్చు. రూ.1,999 విలువైన ఎంఐ బిజినెస్ క్యాజువల్ బ్యాక్ప్యాక్ను రూ.499.50 ధరకు కొనొచ్చు. ఇక సాయంత్రం 6 గంటలకు జరిగే సేల్లో రూ.5,999 విలువైన సౌండ్బార్ను రూ.2499.50 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇక రూ.14,999 విలువైన టీవీని రూ.6499.50 ధరకు కొనొచ్చు. ఇవన్నీ ఫ్లాష్ సేల్లో అమ్మనుంది షావోమీ. ఈ ఫ్లాష్ సేల్ కొన్ని సెకన్లలోనే ముగిసిపోతుంది. షావోమీ వెబ్సైట్లో వీటిని కొనొచ్చు.