200 మంది స్టూడెంట్స్కు సైకిళ్లు ఇస్తాం : కలెక్టర్ హనుమంతరావు

200 మంది స్టూడెంట్స్కు సైకిళ్లు ఇస్తాం : కలెక్టర్ హనుమంతరావు

యాదాద్రి, వెలుగు: పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్​ హనుమంతరావు అన్నారు. ఇందుకోసం 50 రోజుల ప్రణాళిక రూపొందించాలని సూచించారు. కలెక్టరేట్​లో నిర్వహించిన హైస్కూల్​ హెడ్మాస్టర్ల మీటింగ్​లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ స్కూల్స్​లో పదో తరగతి చదువుతున్న 5063 మంది స్టూడెంట్స్​ అందరూ పాస్​ కావాలన్నారు. మంచి మార్కులు సాధించిన 200 మంది స్టూడెంట్స్​కు సైకిళ్లు ఇస్తామని తెలిపారు. ఎన్నికలు, సంక్రాంతి సెలవుల కారణంగా స్కూల్స్​కు సెలవులు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

ఈ కారణంగా స్టడీ విషయంలో స్టూడెంట్స్​కు ఇబ్బంది కలుగుతుందన్నారు. మంచి ఫలితాలతో స్టూడెంట్స్​సంఖ్య పెరుగుతుందని, అందరూ ఆ దిశగా ముందుకు సాగాలని సూచించారు. అడిషనల్​కలెక్టర్​ ఏ భాస్కరరావు, డీఈవో కే  సత్యనారాయణ, డీఆర్​డీవో నాగిరెడ్డి, డీపీవో విష్ణువర్దన్​ రెడ్డి, ఏడీ ప్రశాంత్​ రెడ్డి ఉన్నారు.