ముళ్లపొదల్లో పసికందు.. గాయపరిచిన కుక్కలు

 ముళ్లపొదల్లో పసికందు.. గాయపరిచిన కుక్కలు

యాదాద్రి, వెలుగు:  అప్పుడే పుట్టిన శిశువును ముళ్ల పొదల్లో విసిరేసిన ఘటన యాదాద్రి జిల్లా భువనగిరిలో జరిగింది. ఈ శిశువును కుక్కలు పీక్కుతింటుండగా స్థానికులు గమనించి వాటిని వెల్లగొట్టారు. కానీ, అప్పటికే  శిశువు చనిపోయింది. భువనగిరిలోని ఏరియా హాస్పిటల్​ దగ్గరలోని ముళ్లపొదల్లో అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. 

కుక్కలు శిశువును గాయపరిచాయి. గమనించిన ఒక మహిళ వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు, హెల్త్​ స్టాఫ్​ చేరుకొని శిశువు మృతదేహాన్ని హాస్పిటల్​కు తరలించారు. స్థానిక కౌన్సిలర్​ ఊదరి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.