- సర్కార్ బిల్డింగ్ల్లో 23 ఆఫీసులకు చోటు
- ప్రతీ నెల రూ. లక్షల్లో సర్కారుకు మిగులు
- మరో 12 ఆఫీసులకు త్వరలో కేటాయింపు
యాదాద్రి, వెలుగు: అద్దెల భారం దింపుకునేందుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. ప్రైవేట్బిల్డింగ్ల్లో కొనసాగుతూ అద్దె చెల్లింపులు చేస్తున్న డిపార్ట్ మెంట్లలో కొన్నింటికి ఇతర ఆఫీసుల్లో సర్దుబాటు చేసింది. మిగిలిన వాటిని త్వరలో అడ్జస్ట్ చేయనుంది. యాదాద్రి జిల్లాలోని అనేక డిపార్ట్మెంట్లు దశాబ్దాల తరబడి ప్రైవేట్ బిల్డింగ్లోనే కొనసాగుతున్నాయి. ప్రైవేట్ బిల్డింగ్ల్లో తహసీల్దార్ ఆఫీసులతో పాటు పలు హాస్టల్స్ కూడా ఉన్నాయి. చివరకు ఇంటిలిజెన్స్ ఆఫీసు కూడా ప్రైవేట్ బిల్డింగ్ లలోనే కొనసాగిస్తున్నారు.
ఈ విధంగా యాదాద్రి జిల్లాలోని హాస్టల్స్సహా 35 విభాగాలు ప్రైవేట్ బిల్డింగ్లో కొనసాగుతున్నాయి. ఇందుకోసం ప్రతి నెల రూ. లక్షల్లో అద్దె చెల్లిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అద్దె ఆలస్యమైన కారణంగా ఓనర్లు ఆయా బిల్డింగ్లకు తాళాలు కూడా వేస్తున్నారు. మోత్కూరులో ప్రైవేట్ బిల్డింగ్లో కొనసాగుతున్న హాస్టల్కు ఓనర్ తాళం వేశాడు. ఇలాంటి పరిణమాలతో పాటు రూ. లక్షల్లో అద్దె భారం తగ్గించుకోవడానికి ఆఫీసులను అడ్జస్ట్మెంట్ చేయాలని నిర్ణయం తీసుకొని ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ బిల్డింగ్ల్లోకి వెళ్లనున్న విభాగాలు, ఆఫీసులు, హాస్టల్స్ ఇవే..
-భువనగిరిలోని కమర్షియల్ టాక్స్ఆఫీసును ఖాళీగా ఉన్న పాత లైబ్రరీని కేటాయించారు. -లీగల్ మెట్రాలజీని కలెక్టరేట్లోని ఏఓ ఆఫీసులో అడ్జస్ట్ చేశారు. -చౌటుప్పల్లోని తహసీల్దార్ఆఫీసును మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్న చోటును కేటాయించారు. -భువనగిరిలోని ఎక్సైజ్ఆఫీసును రాయగిరిలోని పంచాయతీ బిల్డింగ్ను కేటాయించారు. -మోత్కూరులోని ఎక్సైజ్ఆఫీసును మున్సిపాలిటీ బిల్డింగ్లో అడ్జస్ట్ చేశారు. -ఆలేరులోని ఎక్సైజ్ఆఫీసుకు ఇండోర్స్టేడియం పరిధిలోని ఖాళీ గదులను కేటాయించారు.
-రామన్నపేటలోని ఎక్సైజ్ ఆఫీసుకు ఖాళీగా ఉన్న బీసీ హాస్టల్ బిల్డింగ్ను కేటాయించారు. -జిల్లా ఎక్సైజ్ఎస్పీ ఆఫీసును కలెక్టరేట్లోని ఈ- బ్లాక్ను కేటాయించనున్నారు. -చౌటుప్పల్సబ్డివిజన్-4 ఇరిగేషన్ ఈఈ ఆఫీసుకు మార్కెట్ కమిటీ బిల్డింగ్ కేటాయించారు. ఆర్అండ్బీ ఎస్ఈ ఆఫీసును పాత మున్సిపాలిటీ బిల్డింగ్లోని ఫస్ట్ ఫ్లోర్ లో అద్దె లేకుండా కంటిన్యూ చేయనున్నారు. -యాదగిరిగుట్టలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసును స్కిల్ డెవలప్మెంట్ బిల్డింగ్ పరిధిలోకి మార్చనున్నారు. భువనగిరిలోని సబ్ రిజిస్ట్రార్ఆఫీసును పాత మున్సిపల్బిల్డింగ్లో అద్దె లేకుండా కంటిన్యూ చేయనున్నారు. -రామన్నపేటలోని ఆర్అండ్బీ సబ్డివిజన్ ఆఫీసును ఖాళీగా ఉన్న బీసీ బాలుర హాస్టల్ బిల్డింగ్ కేటాయించారు.
-మోత్కూరులోని ఎస్టీవోను ఎంపీడీవో లేదా ఎంఏవో ఆఫీసులో అడ్జస్ట్ చేయనున్నారు. - సంస్థాన్ నారాయణపూర్లోని ఇరిగేషన్సబ్డివిజన్-3ని ఫారెస్ట్ బిల్డింగ్లో అడ్జస్ట్ చేయనున్నారు. -ఆలేరులోని ఫైర్స్టేషన్ను అవుట్డోర్ స్టేడియం పరిధిలో కొనసాగించనున్నారు. రామన్నపేటలోని ఐసీడీఎస్కు పాత పీఏసీఎస్ బిల్డింగ్ కేటాయించారు. -రామన్నపేటలోని ఎస్సీ, బీసీ బాలికల హాస్టల్స్ కు బీసీ హాస్టల్ బిల్డింగ్కేటాయించారు. -రామన్నపేటలోని అసిస్టెంట్ సోషల్వెల్ఫేర్ఆఫీసుకు ఎస్సీ బాలుర హాస్టల్ను కేటాయించారు. -చౌటుప్పల్లోని సబ్డివిజన్-2 ఇరిగేషన్ డీఈఈకి మహిళా కమ్యూనిటీ బిల్డింగ్కేటాయించారు. -భువనగిరిలోని పాత మున్సిపాలిటీ బిల్డింగ్లోని ఓ పోర్షన్ను ఇంటలిజెన్స్ డిపార్ట్మెంట్కు కేటాయించారు. -టీఎస్ఆయిల్ఫెడ్ఆఫీసును కలెక్టరేట్లోని హార్టికల్చర్ఆఫీసులో అడ్జస్ట్ చేయనున్నారు.
హాస్టల్స్ సహా 23 విభాగాలు సర్కార్ బిల్డింగ్ల్లోకి..
ప్రభుత్వ ఆదేశాలతో ప్రైవేట్ బిల్డింగ్లో కొనసాగుతున్న 35 ఆఫీసుల వివరాలను అడిషనల్ కలెక్టర్ ఏ భాస్కరరావు(ఐఏఎస్) తెప్పించుకున్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉంటూ ఖాళీగా ఉంటున్న వాటి వివరాలు కూడా తెప్పించుకున్నారు. ప్రైవేట్ బిల్డింగ్లో కొనసాగుతున్న విభాగాల ఆఫీసర్ల నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లగలుగుతారో అభిప్రాయాలు తీసుకున్నారు. అనంతరం కలెక్టరేట్లోని పలు డిపార్ట్మెంట్ల ఆఫీసుల్లో ఎక్కువ స్థలం ఉన్న వాటిల్లో ఇతర డిపార్ట్మెంట్లను అడ్జెస్ట్ చేయడం ప్రారంభించారు.
ఖాళీగా ఉంటున్న ప్రభుత్వ బిల్డింగ్లను హాస్టల్స్ సహా కొన్నింటికి కేటాయించారు. ఈ విధంగా ప్రైవేట్ బిల్డింగ్ల్లో కొనసాగుతున్న 35 ఆఫీసుల్లో 23 ఆఫీసులను అడ్జస్ట్ చేశారు. మిగిలిన వాటికి కూడా త్వరలో అడ్జస్ట్ చేయనున్నారు. ఈ కార్యాలయాలన్నీ వచ్చే నెల 1 నుంచి ప్రైవేట్ బిల్డింగ్లను ఖాళీ చేసి కేటాయించిన ఆఫీసుల్లో చేరిపోవాల్సి ఉంది. దీంతో ప్రభుత్వానికి ప్రతి నెల రూ. లక్షల భారం తగ్గిపోనుంది.
