
సీఎం జగన్ తీరు వల్లే బడ్జెట్లో ఏపీకి నిధులు కేటాయించలేదన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు . కేంద్రం ప్రవేశ పెట్టిన రెండు బడ్జెట్లలో ఏపీకి నిధులు కేటాయించలేదన్నారు. 25 మంది ఎంపీలను గెలపిస్తే కేంద్రం మెడలు వంచి నిధులు తెస్తానన్న జగన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చే సత్తా జగన్ కు లేదన్నారు. విభజన చట్టం ప్రకారం కూడా రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవడంలో కూడా విఫలమయ్యారని అన్నారు. సీఎం జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
see more news