
టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ టెస్ట్ క్రికెట్ లో అసాధారణ ఫామ్ తో దూసుకెళ్తున్నాడు. వెస్టిండీస్, ఆస్ట్రేలియా గడ్డపైనా సెంచరీ బాదిన ఈ యువ ఓపెనర్.. శుక్రవారం (జూన్ 20) లీడ్స్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో శతకం కొట్టాడు. ఇంగ్లాండ్ గడ్డపై తొలి సిరీస్.. తొలి మ్యాచ్ అయినా ఎంతో పరిణితి చెందిన బ్యాటర్ ల ఆడాడు. 159 బంతుల్లో 101 పరుగులు చేసి కెరీర్ లో ఐదో సెంచరీ నమోదు చేశాడు. కెఎల్ రాహుల్తో కలిసి 24.5 ఓవర్లలో తొలి వికెట్కు 91 పరుగులు జోడించి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు.
కెప్టెన్ శుభమాన్ గిల్ తో మూడో వికెట్ కు 131 పరుగులు జోడించి జట్టు భారీ స్కోర్ కు బాటలు వేశాడు. జైశ్వాల్ తొలి రోజు ఇబ్బందిపడుతూనే బ్యాటింగ్ చేశాడు. రెండు చేతులకు తిమ్మిర్లు వచ్చినా పట్టు వదలకుండా బ్యాటింగ్ చేశాడు. తొలి రోజు ఆట ముగిశాక ఈ విషయాన్ని జైశ్వాల్ వెల్లడించాడు. "బ్యాటింగ్ ఆడే సమయంలో నాకు రెండు చేతులూ నొప్పులుగా ఉన్నాయి. తిమ్మిర్లు కారణంగా బ్యాటింగ్ చేయడానికి కాస్త ఇబ్బంది పడ్డాను. ఇండియా ఏ తరపున.. బెకెన్హామ్ (ఇంట్రా-స్క్వాడ్)లో ఆడుతున్నప్పుడు మా సన్నాహాలు బాగున్నాయి. నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను". అని జైస్వాల్ పోస్ట్ డే ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పుకొచ్చాడు.
►ALSO READ | IND vs ENG 2025: బ్లాక్ సాక్స్ ధరించిన గిల్.. వివాదంలో టీమిండియా కెప్టెన్
సెంచరీ వరకు అద్భుతంగా బ్యాటింగ్ చేసిన జైశ్వాల్ బెన్ స్టోక్స్ విసిరిన ఒక సూపర్ డెలివరీకి బౌల్డయ్యాడు. దీంతో జైశ్వాల్ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే కెప్టెన్ శుభ్మన్ గిల్ (175 బాల్స్లో 16 ఫోర్లు, 1 సిక్స్తో 127 బ్యాటింగ్), యశస్వి జైస్వాల్ (159 బాల్స్లో 16 ఫోర్లు, 1 సిక్స్తో 101) ఇంగ్లండ్ గడ్డపై సెంచరీలతో దుమ్మురేపారు. మొదట బ్యాటింగ్కు దిగిన టీమిండియా85 ఓవర్లలో 359/3 చేసి భారీ స్కోరుకు బాటలు వేసుకుంది. ఓపెనర్గా వచ్చిన కేఎల్ రాహుల్ (42) ఆకట్టుకోగా.. గిల్కు తోడుగా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ (102 బాల్స్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 65 బ్యాటింగ్) ఫిఫ్టీతో క్రీజులో ఉన్నాడు.
Yashasvi Jaiswal: "I had cramps in both hands, but that’s part of the game. Preparation in Beckenham was excellent great ground, great atmosphere." [Sahil Malhotra] pic.twitter.com/iLprNpiOvh
— Cricket Winner (@cricketwinner_) June 20, 2025