
- యశ్వంత్పూర్కు ఈ నెల10 నుంచి 16 కోచ్లతో నడపాలని నిర్ణయం
- ఇప్పటికే సికింద్రాబాద్నుంచి పలు ప్రాంతాలకు వందేభారత్ సర్వీసు
హైదరాబాద్సిటీ, వెలుగు: సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్రైలు వందేభారత్లో ప్రయాణించడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కాచిగూడ–యశ్వంత్పూర్మధ్య 8 కోచ్లతో నడిచే వందే భారత్ను ఈ నెల 10 నుంచి 16 కోచ్లతో నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం ట్రైన్నంబర్20703 చైర్కార్–07తో నడిచే ఈ రైలును చైర్కార్–16గా మార్చనున్నారు. అలాగే ట్రైన్నంబర్20704లో ప్రస్తుతం ఉన్న ఎగ్జిక్యూటివ్ క్లాస్–01 నుంచి ఎగ్జిక్యూటివ్ క్లాస్–2గా మార్పు చేశారు.
కాచిగూడ–యశ్వంత్పూర్–కాచిగూడ వందేభారత్ఎక్స్ప్రెస్ను ముందుగా 8 ఎనిమిది కోచ్లతో ప్రారంభించారు. ప్రారంభించిన వెంటనే ఈ రైలులో ప్రయాణించేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో మరో 8 కోచ్లను పెంచాలని నిర్ణయించారు. దీనిపై రైల్వే జీఎం సందీప్మాధుర్మాట్లాడుతూ వందేభారత్ కోచ్లను పెంచడం వల్ల ఐటీ సిటీస్గా అభివృద్ధి చెందిన బెంగళూరు, హైదరాబాద్ మధ్య ప్రయాణించే వారికి ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు.
ఇవే కాకుండా ప్రస్తుతం సికింద్రాబాద్–నాగ్పూర్, విశాఖపట్నం– సికింద్రాబాద్, సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య రెండు వందేభారత్ రైళ్లను నడుపుతున్నారు. ఇందులో నాగ్పూర్ 8 కోచ్లు, విశాఖపట్నం, సికింద్రాబాద్ల మధ్యనడిచే వందేభారత్20 కోచ్లతో నడుస్తున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే సికింద్రాబాద్, తిరుపతి మధ్య నడిచే వందేభారత్ 16కోచ్లతో నడుపుతున్నారు.