శ్రీకాళహస్తిలో ఉద్రికత్త: టీడీపీ అభ్యర్థిపై కత్తితో దాడికి యత్నం

శ్రీకాళహస్తిలో ఉద్రికత్త: టీడీపీ అభ్యర్థిపై కత్తితో దాడికి యత్నం

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిపై వైసీపీ కార్యకర్త దాడికి యత్నించిన నేపథ్యంలో శ్రీకాళహస్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో సెల్ఫీ వీడియో తీసుకుంటానని ఓ వ్యక్తి రాగా, అతని జేబులో కత్తిని గుర్తించారు సుధీర్ అనుచరులు. కత్తితో దాడికి  దిగక ముందే అతన్ని అడ్డుకున్నారు టీడీపీ శ్రేణులు. దాడికి యత్నించిన మునికుమార్ వైసీపీ కార్యకర్తగా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఎన్నికల్లో టీడీపీని ఎదుర్కునే దమ్ము లేక వైసీపీ ఇలా దాడులకు పాల్పడుతోందని టీడీపీ శ్రేణులు కామెంట్ చేస్తున్నారు.శ్రీకాళహస్తి అసెంబ్లీ బరిలో వైసీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి బరిలో ఉన్నారు. టీడీపీ నుండి బొజ్జల సుధీర్ రెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య గట్టి పోటీ నెలకొంది. గత ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ మెజారిటీ సాధించాలని మధుసూదన్ రెడ్డి భావిస్తుండగా, ఈసారి ఎలా అయినా శ్రీకాళహస్తిలో తమ జెండా ఎగురవేయాలని టీడీపీ భావిస్తోంది.