అమరావతి: మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు యడ్లపాటి వెంకట్రావు మృతి కి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన యడ్లపాటి రాజకీయ జీవితం ఎంతో ఆదర్శ ప్రాయంగా సాగిందని చంద్రబాబు పేర్కొన్నారు. మంత్రిగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా, రాజ్యసభ సభ్యునిగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగిన యడ్లపాటి... తాను చేపట్టిన పదవులకు వన్నెతెచ్చారని అన్నారు. యడ్లపాటి వెంకటరావు జీవితం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. తనకు వ్యక్తిగతంగా యడ్లపాటితో ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో అరుదైన వ్యక్తిగా యడ్లపాటి ఎప్పటికీ గుర్తుండిపోతారని చంద్రబాబు తెలిపారు. యడ్లపాటి కుంటుంబ సభ్యులకు చంద్రబాబు సానుభూతి తెలియజేస్తూ.. వెంకట్రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
యడ్లపాటి మృతికి పలువురి సంతాపం
యడ్లపాటి వెంకటరావు మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర రాజకీయ ప్రముఖులు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు స్పందించి సంతాపం ప్రకటించారు. టీడీపీ సీనియర్ నేతలు కళా వెంకటరావు, ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు స్పందించి సంతాపం ప్రకటించారు. యడ్లపాటి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఇవి కూడా చదవండి
టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకటరావు కన్నుమూత
నల్లమల చెంచులపై రాజ్భవన్ ఫోకస్