కూకట్ పల్లి నుంచి జగద్గిరిగుట్ట వరకూ ట్రాఫిక్ జాం

కూకట్ పల్లి నుంచి జగద్గిరిగుట్ట వరకూ ట్రాఫిక్ జాం

హైదరాబాద్ : కూకట్ పల్లి నుంచి జగద్గిరిగుట్ట వరకూ నిన్న భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వడ్డేపల్లి ఎన్ క్లివ్ సమీపంలో దాదాపు రెండు గంటల వరకూ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పక్కనే ఉన్న బాలకృష్ణ కాలనీ వాసులు గేట్లు ఏర్పాటు చేసుకుని.. అత్యవసర వాహనాలను కూడా వెళ్లనీయడం లేదని  స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.