టీ గోల్ఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యోగా డే గోల్ఫ్ టోర్నీ

టీ గోల్ఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యోగా డే గోల్ఫ్ టోర్నీ

హైదరాబాద్‌‌: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని టీ గోల్ఫ్ ఫౌండేషన్, స్టూడియో అనంత సంయుక్తంగా ప్రత్యేక గోల్ఫ్ టోర్నీని నిర్వహించాయి. గచ్చిబౌలీ బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్‌‌లో జరిగిన ఈ టోర్నీలో రికార్డు స్థాయిలో 124 మంది గోల్ఫర్లు పాల్గొన్నారు.  గ్రాస్ విన్నర్ గా అనూజ్ మెహతా, బెస్ట్ లేడీ గోల్ఫర్ గా రితికా శాంట్ కేశ్వని,  మెంబర్ కేటగిరీ విన్నర్ గా రాజశేఖర్ రాయపరోలు, హ్యాండీక్యాప్ కేటగిరీ18 విన్నర్​గా టీటీవీఆర్ ప్రసాద్, హ్యాండీ క్యాప్ 19 విన్నర్​గా జేపీ రెడ్డి నిలిచారు.

విజేతలకు స్టూడియో అనంత ఫౌండర్ చైతన్య , కో ఫౌండర్ స్రవంతి, బౌల్డర్ హిల్స్ సీఎఫ్ వో మధుసూదన్, జనరల్ మేనేజర్ పాపిరెడ్డి, డీఎస్ఆర్ గ్రూప్ డైరెక్టర్ సాహిత్ రెడ్డి, ఫోకస్ డెంటల్ కేర్ డాక్టర్ అజయ్ కృష్ణ, నైలా ఎయిర్ వాటర్ పార్ట్​నర్ మధుసూదన్ రావు ట్రోఫీలు అందజేశారు. బ్రీత్ అండ్ బిర్డీ పేరుతో నిర్వహించిన యోగా డే టోర్నీకి ఇంత మంచి స్పందన రావడం సంతోషంగా ఉందని బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్ సీఎఫ్ వో మధుసూదన్ రావు చెప్పారు.