బ్రహ్మోస్ ​పవరేంటో పాక్​నే అడగండి : యోగి ఆదిత్యనాథ్

బ్రహ్మోస్ ​పవరేంటో పాక్​నే అడగండి : యోగి ఆదిత్యనాథ్
  • ఉగ్రవాదాన్ని అణచివేయాల్సినటైం వచ్చింది: యోగి ఆదిత్యనాథ్
  • దేశం మొత్తం ఐక్యంగా మోదీ వెనుక ఉండాలని పిలుపు

లక్నో: ‘ఆపరేషన్ ​సిందూర్’లో భాగంగా మన బ్రహ్మోస్​ మిసైల్ శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ అన్నారు. ఇంకా ఎవరికైనా బ్రహ్మోస్​ పవరేంటో తెలుసుకోవాలని ఉంటే పాకిస్తాన్​ను అడగాలని సూచించారు. లక్నోలోని డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌‌‌‌‌‌‌‌లో బ్రహ్మోస్ సూపర్‌‌‌‌‌‌‌‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఉత్పత్తి యూనిట్‌‌‌‌‌‌‌‌ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్  వర్చువల్‌‌‌‌‌‌‌‌గా ప్రారంభించగా.. యోగి ఆదిత్యనాథ్​ మాట్లాడారు. 

ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతోసహా అణచివేయాల్సి సమయం వచ్చిందని, దేశ ప్రజలందరూ ఐక్యంగా ప్రధాని మోదీ వెంట ఉండాలని పిలుపునిచ్చారు. టెర్రరిజం అనేది కుక్క తోకలాంటిదని, దానికి ఎన్నటికీ సరిచేయలేమని అన్నారు. ‘‘ఉగ్రవాదానికి ప్రేమ భాష తెలియదు. దాని భాషలోనే మనం బదులివ్వాలి. ఈ దిశలో ఆపరేషన్​ సిందూర్​తో ప్రపంచానికి భారత్​ఒక సందేశం ఇచ్చింది”  అని తెలిపారు. ఆపరేషన్​సిందూర్​ విజయవంతమైనందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​సింగ్​కు, భారత సాయుధ బలగాలకు అభినందనలు తెలిపారు.